లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ రగడ

లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ రగడ
x
Highlights

ట్రిపుల్ తలాక్ బిల్లు మరోసారి పార్లమెంటు ముందు చర్చకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే...

ట్రిపుల్ తలాక్ బిల్లు మరోసారి పార్లమెంటు ముందు చర్చకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే బిల్లుపై కాంగ్రెస్, ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రిపుల్ తలాఖ్ బిల్లు మరోసారి పార్లమెంట్‌ ముందుకు వచ్చింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు-2019ని లోక్‌సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టారు. ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికే ఈ బిల్లు తీసుకొచ్చామని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ట్రిపుల్ తలాఖ్ బిల్లును కాంగ్రెస్, ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. ట్రిపుల్ తలాక్ కు తాను వ్యతిరేకమంటూనే దీన్నో నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలియజేశారు. బిల్లులో ఎలాంటి విధానపరమైన భద్రతలు లేనందున స్టాండింగ్ కమిటీకి నివేదించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహిళల పట్ల మోదీ సర్కారు వివక్ష చూపుతోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ఈ సందర్భంగా శబరిమల అంశాన్ని ఒవైసీ ప్రస్తావించారు. బీజేపీ నాయకత్వం శబరిమల విషయంలో ఒక విధంగా, ట్రిపుల్ తలాఖ్ విషయంలో మరో విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగి సభలో గందరగోళం ఏర్పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories