Coronavirus: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 649, 13 మరణాలు

Coronavirus: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 649, 13 మరణాలు
x
Highlights

భారతదేశంలో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే దేశంలోని...

భారతదేశంలో కరోనా వైరస్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే దేశంలోని 26రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్‌ పాకింది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిర్థారణ కేసుల సంఖ్య 649కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనాతో 13 మంది మృతి చెందినట్లు తెలిపింది. 42 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

అత్యధికంగా మహారాష్ట్రలో 123 కేసులు, కేరళలో 118, కర్ణాటకలో 51, తెలంగాణలో 41, గుజరాత్‌లో 38, రాజస్థాన్‌లో 38, ఉత్తరప్రదేశ్‌లో 38, ఢిల్లీలో 35, హర్యానాలో 31, పంజాబ్‌లో 31, తమిళనాడులో 26, మధ్యప్రదేశ్‌లో 21, లడఖ్‌లో 13, జమ్మూకశ్మీర్‌లో 11, ఏపీలో 10, బెంగాల్‌లో 10, చండీఘర్‌లో 7, ఉత్తరాఖండ్‌లో 5, బీహార్‌లో 4, ఛత్తీస్‌గఢ్‌లో 3, గోవాలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 2, మణిపూర్‌, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories