ఎన్డీయేకు దక్కేది అన్ని సీట్లే.. సర్వే అంచనా..

ఎన్డీయేకు దక్కేది అన్ని సీట్లే.. సర్వే అంచనా..
x
Highlights

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారానికి 20 సీట్ల దూరంలో నిలుస్తుందని ఆంగ్ల వార్తాచానెల్‌ 'టెమ్స్‌ నౌ'.. వీఎంఆర్‌ సంస్థ సర్వే తేల్చింది. ఈ సంస్థ...

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారానికి 20 సీట్ల దూరంలో నిలుస్తుందని ఆంగ్ల వార్తాచానెల్‌ 'టెమ్స్‌ నౌ'.. వీఎంఆర్‌ సంస్థ సర్వే తేల్చింది. ఈ సంస్థ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జనవరి 14 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 15, 731 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అందులో ఎన్డీయేకు 252, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 147, ఈ రెండు కూటముల్లోనూ లేని ఇతర పార్టీలకు 144 ఎంపీ సీట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది.

ఇక తెలంగాణలో అధికార టీఆరెస్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణాలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను 10 టీఆరెస్, కాంగ్రెస్ 5 , బీజేపీ 0- 1, ఇతరులు 1 గెలుకుంటాయని వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌సీపీకి 23, టీడీపీ 2 సీట్లు దక్కుతాయని వెల్లడించింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories