జై శ్రీరామ్ అని చెప్పాలంటూ యువకుడ్ని చావ బాదారు

జై శ్రీరామ్ అని చెప్పాలంటూ యువకుడ్ని చావ బాదారు
x
Highlights

మానవత్వాన్ని మరిచిన మనుషులు మతోన్మాద ముసుగులో మృగాల్లా మారుతున్నారు. మతం పేరుతో ఓ ముస్లిం యువకుడిని అల్లరి మూకలు చావబాదిన దారుణ ఘటన ఆలస్యంగా శుక్రవారం...

మానవత్వాన్ని మరిచిన మనుషులు మతోన్మాద ముసుగులో మృగాల్లా మారుతున్నారు. మతం పేరుతో ఓ ముస్లిం యువకుడిని అల్లరి మూకలు చావబాదిన దారుణ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. ఇటీవల జార్ఖండ్‌ లో తబ్రేజ్‌ అన్సారీ అనే ముస్లిం యువకుడిని కొట్టి చంపిన ఘటనను మర్చిపోకముందే.. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. క్యాబ్‌ నడుపుకుంటున్న ఫైజల్‌ ఉస్మాన్‌ (25) అనే యువకుడిని చుట్టుముట్టిన కొందరు దుండగులు, జై శ్రీరామ్‌ అని చెప్పాలంటూ.. ముస్లిం యువకుడిని చావబాదారు. చివరికి ఉస్మాన్‌ స్పహ కోల్పోవడంతో చనిపోయాడు అనుకుని పారిపోయారు. థానేలో గత ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పైజల్‌ ఉస్మాన్‌ గత ఆదివారం తెల్లవారుజామున బుకింగ్‌ రావడంతో ప్రయాణికుడిని ఎక్కించుకుని బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో అతని వాహనం మొరాయించింది. అంతలోనే బైక్‌ పై ముంగేశ్‌ ముండే (30), అనిల్‌ సూర్యవంశి (22), జయదీప్‌ ముండే (26) లు అటుగా వచ్చారు. ముస్లిం మతస్తుడైన ఉస్మాన్‌ ను చూస్తూనే గొడవ పెట్టుకున్నారు. కారు నుంచి బయటకు లాగిపడేసి కొట్టడం మొదలుపెట్టారు. చనిపోయాడని భావించి అక్కడి నుండి పారిపోయారు



Show Full Article
Print Article
More On
Next Story
More Stories