మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
x
Highlights

మహారాష్ట్ర: మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. పుణెలోని కుంద్వా ప్రాంతంలో తెల్లవారుజామున గోడ కూలి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. నిలిపి ఉన్న ఆటోలు,...

మహారాష్ట్ర: మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. పుణెలోని కుంద్వా ప్రాంతంలో తెల్లవారుజామున గోడ కూలి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. నిలిపి ఉన్న ఆటోలు, కార్లపై గోడ కూలడంతో మృతుల సంఖ్య పెరిగింది. ప్రమాద ఘటననలో 12 మంది అక్కడికక్కడే చనిపోగా..తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గోడ కూలి 15 మంది చనిపోయిన ఘటనతో పుణె ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ప్రమాదంలో మరణించిన వారంతా ఆటో రిక్షా కార్మికులుగా భావిస్తున్నారు. రాత్రి సమయంలో గోడ కూలడంతో నిద్రిస్తున్న వారంతా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు తొమ్మిది మంది పురుషులు, చిన్నారులు.. ఒక మహిళ ఉన్నారు. గోడ పక్కనే నిలిపి ఉంచిన వాహనాలపై గోడ కూలి పడింది. శిథిలాల కింద పడిన వాహనాలను సహాయక బృందాలు తొలగించాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories