బీజేపీలో చేరిన అనంతరం సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు

బీజేపీలో చేరిన అనంతరం సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు
x
Highlights

టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ...

టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ ముగ్గురు కమలం గూటికి చేరారు. పార్టీ కండువాలు కప్పి జేపీ నడ్డా వీరిని సాధరంగా ఆహ్వానించారు. అనంతరం సుజనా చౌదరి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు నెరవేరాలంటే బీజేపీతో కలిసి పనిచేయాలని సుజనా అభిప్రాయం వ్యక్తం చేశారు. సంఘర్షిస్తే ఉపయోగం లేదని స్పష్టం చేశారు. భారతదేశం ఎవరితో ఉందో మొన్నటి ఎన్నికలే నిదర్శనం అన్నారు. అందుకే తాము బీజేపీలో ఉండాలని నిర్ణయించుకున్నామని సుజనా తెలిపారు. హక్కుల కోసం కేంద్రంపై పోరాటమంటూ తెలుగుదేశం పార్టీ అనుసరించిన ధోరణిని పరోక్షంగా ఆయన గుర్తు చేశారు. సుజనా చౌదరికి మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కొచ్చంటూ ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories