తన పొలంలో మోదీకి గుడి కట్టిన రైతు

తన పొలంలో మోదీకి గుడి కట్టిన రైతు
x
Highlights

ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమానాన్ని చూపిస్తుంటారు. అందులో ఎవరి ప్రత్యేకత వారిది. అందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి వీర అభిమాని అయిన ఓ రైతు...

ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమానాన్ని చూపిస్తుంటారు. అందులో ఎవరి ప్రత్యేకత వారిది. అందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి వీర అభిమాని అయిన ఓ రైతు ఏకంగా తన పోలంలో గుడి కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలోని ఎరకుడిలో జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పలు పథకాలతో శంకర్‌ అనే రైతు మోదీ పట్ల అభిమానం పెంచుకున్నాడు.

దీనితో తన పోలంలో మోడీ కోసం గుడి కట్టించి నిత్యం ఆరాధిస్తున్నాడు.. ఈ సందర్భంగా ఆ రైతు మాట్లాడుతూ.. "ఈ ఆలయాన్ని 8 నెలల కిందట మొదలు పెట్టి గత వారమే ప్రారంభించానని, గుడి నిర్మాణానికి దాదాపుగా రూ.1.2లక్షలు ఖర్చు చేసినట్టుగా తెలిపాడు. మోడీ సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. ఆయన వ్యక్తిత్వం కూడా నన్ను ఎంతో ఆకర్షించిందని, త్వరలో కుంభాభిషేకం చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు.

ఈ గుడిలో ఆ రైతు దేవుడి చిత్ర పటాలతో పాటు ప్రధాని మోడీ, దివంగత మాజీ సీఎం జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చిత్ర పటాలను కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న భాజపా తిరుచిరాపల్లి జోనల్‌ ఇన్‌ఛార్జి కన్నన్‌ ఆ రైతును తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారట.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories