దారుణం :ఎమ్మెల్యేను కాల్చిచంపిన దుండగులు

దారుణం :ఎమ్మెల్యేను కాల్చిచంపిన దుండగులు
x
Highlights

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వా్‌సను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన...

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వా్‌సను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన నదియా జిల్లాలో శనివారం జరిగింది. శనివారం సరస్వతీ పూజలో పాల్గొన్న ఆయన.. వేదిక నుంచి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై బులెట్ల వర్షం కురిపించారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. దీంతో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఈ హత్య వెనుక పలువురు హస్తముందని, ముకుల్‌రాయ్‌ అనుచరులే బిశ్వా్‌సను చంపారని జిల్లా టీఎంసీ అధ్యక్షుడు గౌరీశంకర్‌ ఆరోపించారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ లోని ఫ్యాక్షనే ఈ హత్యకు కారణమని బీజేపీ నాయకుడు దిలీప్‌ ఘోష్‌ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories