ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు మృతి !

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు మృతి !
x
Highlights

ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మేందుకు వెళ్ళిన రైతులు రోడ్డు ప్రమాదానికి...

ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మేందుకు వెళ్ళిన రైతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎటవా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు దుర్మరణం చెందారు. పండ్లను విక్రయించడానికి రైతులు ట్రక్కులో వస్తుండగా.. ఎటవా ఫ్రెండ్స్ కాలనీ సమీపంలో ఎదురెదుగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు.

మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు ఎటవా జిల్లా ఎస్పీ ఆర్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories