పెళ్లైన కొద్ది సేపటికే...గర్భవతి!

పెళ్లైన కొద్ది సేపటికే...గర్భవతి!
x
Highlights

అచ్చం పాత తెలుగు సినిమాల్లోలా జరిగింది ఆ సంఘటన.

అచ్చం పాత తెలుగు సినిమాల్లోలా జరిగింది ఆ సంఘటన. ఘనంగా పెళ్లి జరుగుతోంది. మంగళ వాద్యాలు..బంధుమిత్రుల సందడి.. వేడుకగా వివాహ కార్య క్రమం సాగుతోంది. ఇంతలో హఠాత్తుగా పెళ్లికూతురు కళ్ళు తిరిగి పడిపోయింది. అకస్మాత్తుగా అక్కడ అలజడి. ఆమెకు ఏమైందన్న కంగారు అందరిలో. పెళ్ళికి హాజరైన ఓ డాక్టర్ అక్కడికక్కడే ఆ వధువును పరీక్షించారు. తరువాత అసలు విషయం చల్లగా చెప్పారు. అంతే.. అంత హడావుడీ ఒక్కసారిగా మూగబోయింది. ఇంతకీ ఆమెకు ఏమైందో తెలుసా.. ఆ నవ వధువు గర్భవతి అని తేలింది. పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్‌ లోని బీర్బుమ్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ఘనంగా పెళ్లి జరిగిన కొద్ది సేపటికే వధువు తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో అక్కడున్న వాళ్లంతా వధువుకు ఏమైందో ఏంటో అంటూ ఖంగారు పడ్డారు. అదే పెళ్లికి హాజరైన ఓ డాక్టర్ హుటాహుటిన వధువు దగ్గరికి చేరుకుంది. తరువాత ఆ డాక్టర్ ఆమెను పరీక్షించి ఐదు నెలల గర్భవతి అని మెళ్లిగా చెప్పింది . ఈ విషయం వినడంతోనే అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదేం విడ్డూరం అంటూ నోరు వెల్లబెట్టారు.

పచ్చని పందిరిలో మూడు ముళ్లు వేసి గంట గడవకముందే తన భార్య గర్భవతి అని తేలడంతో వరుడు అవాక్కయ్యాడు. వరుణ్ణి, వారి కుటుంబాన్ని వధువు తరుపువారు మోసం చేశారంటూ గొడవ చేసారు. దీంతో పచ్చని పెళ్లి పందిరి కాస్తా యుద్ధ భూమిలా మారింది. అసలు వధువు గర్భానికి కారణమైన వారి గురించి ఆరా తీసారు. వధువు స్నేహితుడే ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేసినట్లు తెలుసుకున్నారు. ఆమెపై అత్యాచారం చేసిన నిందితుడు యువతి గర్భవతి అని తెలియగానే గ్రామం నుంచి పరారయ్యాడు. ఈ విషయాలన్నింటినీ తెలుసుకున్న బాధితురాలి బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేసారు. వారు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడి కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories