సోషల్ మీడియాలో వైరల్‌..హృదయాలను కలిచి వేస్తోన్న ఫోటో

సోషల్ మీడియాలో వైరల్‌..హృదయాలను కలిచి వేస్తోన్న ఫోటో
x
Highlights

ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్‌ అవుతోన్న ఓ ఫోటో చూస్తే ఖాకీలు కూడా అందరిలాంటి వారేనని వారికి కూడా స్పందించే హృదయం ఉంటుందని అర్థం అవుతుంది. ఓ...

ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్‌ అవుతోన్న ఓ ఫోటో చూస్తే ఖాకీలు కూడా అందరిలాంటి వారేనని వారికి కూడా స్పందించే హృదయం ఉంటుందని అర్థం అవుతుంది. ఓ ఉన్నతాధికారి చనిపోయిన తన సహోద్యోగి కుమారుడిని ఎత్తుకుని కన్నీటి పర్యంతమవుతున్న ఫోటో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

అనంతనాగ్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అర్షద్‌ ఖాన్‌ అనే పోలీసు అమరుడయ్యాడు. ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ సుపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ హసీబ్‌ ముఘల్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో హసీబ్‌, మరణించిన అర్షద్‌ ఖాన్‌ నాలుగేళ్ల కుమారుడు ఉబన్‌ను ఎత్తుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇన్‌స్పెక్టర్ కొడుకుని ఎత్తుకుని కన్నీటిపర్యంతమైన ఎస్పీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూస్తే ఖాకీలు కూడా అందరిలాంటి వారేనని వారికి కూడా స్పందించే హృదయం ఉంటుందనే విషయం మరోసారి స్పష్టమయింది.

జూన్ 13న అనంతనాగ్‌‌లో జరిగిన ఉగ్రదాడిలో ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు అర్షద్‌ ఖాన్‌. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో చికిత్స కోసం ఢిల్లీ తరలించారు. ఖాన్‌ను బ్రతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో జూన్ 16న అర్షద్‌ఖాన్ తుదిశ్వాస విడిచారు. సాదర్ పోలీస్‌ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ల ఖాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories