పండగకి పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు...

పండగకి పెరిగిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు...
x
Highlights

దసరా పండుగ సందర్భంగా రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను రైల్వే అధికారులు పెంచేసారు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10...

దసరా పండుగ సందర్భంగా రద్దీ దృష్ట్యా రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరలను రైల్వే అధికారులు పెంచేసారు. ప్రస్తుతమున్న ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10 రూపాయలను ఏకంగా రూ.30 రూపాయలకు పెంచేసారు. ఈ శనివారం నుంచి అక్టోబర్ 10 వరకు ఫ్లాట్ ఫాం టికెట్ ను రూ.30కు విక్రయించనుంది. దసరా సెలవుల రద్దీ దృష్ట్యా పలు రైల్వే స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ ధర తాత్కాలికంగా పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే. పండగ సీజన్ కావడం, రైల్వే స్టేషన్లు అన్ని కిక్కిరిసిపోవడం ఖాయం కావడంతో ప్లాట్ ఫాంపై రద్దీని కొద్దిమేర నియంత్రించవచ్చని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories