పార్లమెంట్ సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం.. గడువు కన్నా ముందుగానే

పార్లమెంట్ సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం.. గడువు కన్నా ముందుగానే
x
Parliament
Highlights

కరోనా ప్రభావం పార్లమెంట్‌పై పడింది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో పార్లమెంట్ సమావేశాలు గడువు కంటే ముందుగానే ముగించాలనే కేంద్రం యోచన...

కరోనా ప్రభావం పార్లమెంట్‌పై పడింది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో పార్లమెంట్ సమావేశాలు గడువు కంటే ముందుగానే ముగించాలనే కేంద్రం యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వచ్చే నెల 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉండగా ఈ నెల 15 వ తేదీ లోగానే ముగించాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే శనివారం, ఆదివారం కూడా సమావేశాలు నిర్వహించి ఆదివారంతో సమావేశాలకు ముగింపు పలకాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే విజిటర్స్ పాస్‌లను కూడా అధికారులు రద్దు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories