తల్లిదండ్రులకి వార్నింగ్ : పిల్లలకు బండి ఇస్తే ఇక జైలుకే!

తల్లిదండ్రులకి వార్నింగ్ : పిల్లలకు బండి ఇస్తే ఇక జైలుకే!
x
Highlights

ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కాబోతున్నాయి. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు ప్రకారం చిన్నపిల్లలకు వాహనాలిస్తే వారి తల్లిదండ్రులకు మూడేళ్లు జైలు శిక్ష...

ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కాబోతున్నాయి. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు ప్రకారం చిన్నపిల్లలకు వాహనాలిస్తే వారి తల్లిదండ్రులకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే 10 వేల జరిమానా విధిస్తారు. కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన ఈ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా వాత పెట్టే మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటిదాకా విధిస్తున్న జరిమానాలు ఇక మీదట రెట్టింపు కానున్నాయి. రూల్స్ బ్రేక్ చేసే వారి జేబుకు ఇక చిల్లు పడనుంది.

కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి వస్తే పిల్లల వాహనాలు నడిపితే వారి తలిదండ్రులకు లేదా సంరక్షకులకు 25వేల రూపాయల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సదరు సంరక్షకుడి డ్రైవింగ్‌ లైసెన్సు కూడా రద్దుచేస్తారు. ఇక మద్యం సేవించి వాహనం నడిపితే 10,000 రూపాయల జరిమానా కట్టాలి. అత్యవసర సర్వీసులకు, అంబులెన్సులకు దారివ్వాలి. లేకపోతే 10,000 రూపాయల ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది.

లైసెన్సు లేకుండా చట్టవిరుద్ధంగా వాహనం నడిపితే రూ.5000, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.5000, హెల్మెట్‌ లేకుండా నడిపితే రూ.1000 జరిమానా మాత్రమే కాకుండా మూడు నెలల పాటు లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తారు. రవాణా శాఖ ఇచ్చిన ఏ ఆదేశాలనైనా ఉల్లంఘించినట్లు తేలితే కనీసం రూ.2000 వసూలు చేస్తారు. ఇవే రూల్స్ ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపు ఉంటాయి. కేంద్ర మంత్రి వర్గ ఆమోదం పొందిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories