పాక్ మరోసారి వక్రబుద్ధి.. పేల్చేసిన భారత్..

పాక్ మరోసారి వక్రబుద్ధి.. పేల్చేసిన భారత్..
x
Highlights

కొన్నిరోజులుగా సరిహద్దు రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ తాజాగా మరో వక్రబుద్ధి ప్రదర్శించింది. బికనీర్ నల్...

కొన్నిరోజులుగా సరిహద్దు రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ తాజాగా మరో వక్రబుద్ధి ప్రదర్శించింది. బికనీర్ నల్ సెక్టార్‌లోకి డ్రోన్‌ను పంపించింది. దీంతో అప్రమత్తమైన భారత వైమానిక దళం ఈ చర్యను సమర్థవంతంగా తిప్పికోట్టింది.. భారత భూభాగంలోకి అక్రమంగా వచ్చిన పాక్ డ్రోన్‌ను కూల్చేసింది. నల్ సెక్టార్‌లోకి వచ్చిన డ్రోన్‌ను రక్షణ రాడార్ గుర్తించిన వెంటనే.. ఇండియన్ సుఖోయ్ - 30ఎంకేఐ దాన్ని పేల్చేసింది.

ఈ ఘటన మధ్యాహ్నం 12 గంటల ప్రాంతలో జరిగినట్టు సమాచారం. కాగా డ్రోన్‌కు సంబంధించిన శకలాలు పాక్ భూభాగంలో పడినట్టు భద్రత వర్గాలు భావిస్తున్నాయి. కాగా గతవారం గుజరాత్‌ కచ్ ప్రాంతంలో నలియా ఎయిర్ బేస్ లో పాక్ డ్రోన్‌ను భారత్ కూల్చివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories