టర్కీ ఎఫెక్ట్..మళ్లీ ఉల్లి బాంబ్

టర్కీ ఎఫెక్ట్..మళ్లీ ఉల్లి బాంబ్
x
ఉల్లి
Highlights

ఆకాశాన్నంటిన ధరలతో కొనడానికే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ఇటీవల కాస్త దిగి రావడంతో సామాన్యులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ఈ ఆనందం మళ్లీ ఆవిరయ్యేలా...

ఆకాశాన్నంటిన ధరలతో కొనడానికే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ఇటీవల కాస్త దిగి రావడంతో సామాన్యులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ఈ ఆనందం మళ్లీ ఆవిరయ్యేలా కన్పిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. టర్కీ భారత్‌కు ఉల్లి ఎగుమతులు నిలిపివేయడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

దేశంలో ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఇటీవల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో ధరలను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగానే టర్కీ, ఈజిప్టు లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతులు చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారత్‌ 7వేల 070 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోగా దీనిలో 50శాతం టర్కీ నుంచి వచ్చిందేనని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.

అయితే, ఎగుమతుల కారణంగా టర్కీలో కూడా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో భారత్‌కు ఉల్లి ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ దేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 'మనలాగే టర్కీ కూడా ధరల నియంత్రణ కోసం ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. దీంతో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడే అవకాశముంది.

ఎందుకంటే దేశీయంగా పండించిన ఉల్లి ఇప్పుడే మార్కెట్లోకి రాదు. అప్పటిదాకా ధరలు పెరిగే అవకాశమున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒకసారి దేశీయ దిగుబడులు వచ్చిన తర్వాత ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఏదేమైనా సామాన్యులకు 'ఉల్లి'భారం ఇప్పట్లో తప్పేలా కన్పించట్లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories