ఒకే దేశం ఒకే రేషన్ కార్డు .. త్వరలో అమలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం ..

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు .. త్వరలో అమలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం ..
x
Highlights

ఢిల్లీ : - బీజేపి రెండోసారి అధికారం చేపట్టకా పాలనా పైన ద్రుష్టి సాధించింది .. ఈ నేపధ్యంలో 'ఒకే దేశం ఒకే రేషన్ కార్డు' ను ప్రకటించింది .. దీనిని త్వరలో...

ఢిల్లీ : - బీజేపి రెండోసారి అధికారం చేపట్టకా పాలనా పైన ద్రుష్టి సాధించింది .. ఈ నేపధ్యంలో 'ఒకే దేశం ఒకే రేషన్ కార్డు' ను ప్రకటించింది .. దీనిని త్వరలో దేశం అంతటా అమలు చేయనున్నట్లు కేంద్ర ఆహారశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు .. దీని ద్వారా దేశంలో ఏ రేషన్ షాప్ ద్వారా అయిన లబ్దిదారులు రేషన్ ని పొందవచ్చునని అయన వెల్లడించారు .. ఒకే దేశం ఒకే రేషన్ ద్వారా లబ్దిదారులు మరో ప్రాంతానికి వలస వెళ్ళిన అక్కడ కూడా వారికీ రేషన్ అందుతుందని అయన చెప్పారు .. దీనిపై అయన ఆహార భద్రతపై రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు .. దీనివల్ల అవీనితి జరిగే ఛాన్స్ లేదని అయన స్పష్టం చేసారు .. అయితే ఇప్పటికే ఈ విధానం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అమలు అవుతుంది . అయితే దీనిని దేశం మొత్తం విస్తరించాలని దేశం నిర్ణయం తీసుకుంది ..

Show Full Article
Print Article
Next Story
More Stories