లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్‌ బిర్లా ఎంపిక

లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్‌ బిర్లా ఎంపిక
x
Highlights

రాజస్ధాన్‌లోని కోటబందీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఓంబిర్లాను లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. వరుసగా రెండో సారి ఎంపీగా గెలిచిన ఓం...

రాజస్ధాన్‌లోని కోటబందీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఓంబిర్లాను లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. వరుసగా రెండో సారి ఎంపీగా గెలిచిన ఓం బిర్లా 1987 నుంచి బీజేపీ అనుబంధం సంఘం భారతీయ జనతా యువ మోర్చాలో కొనసాగుతూ వచ్చారు. సుదీర్ఘ కాలం పార్టీలో అనుబంధం ఉన్న ఆయన 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. కోట బంది సౌత్ నుంచి పోటీ చేసిన ఆయన 2003, 2008, 2013ల్లో వరుసగా విజయం సాధించారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం కోట బందీ నుంచి బరిలో దింపింది. తొలి సారి విజయం సాధించిన ఆ‍యన తాజా ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఈ నేపధ్యంలోనే ఓం బిర్లాను ఎంపిక చేసినట్టు ‎భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories