టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం

టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం
x
Highlights

భోపాల్‌ భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వర్షాలు పడడంతో తన పార్లమెంట్‌ పరిధిలోని పలు...

భోపాల్‌ భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వర్షాలు పడడంతో తన పార్లమెంట్‌ పరిధిలోని పలు ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో అక్కడ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టాలని ఎంపీ ప్రగ్యాకు స్థానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. దీంతో వారిపై ప్రజ్ఞా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ డ్రైనేజీలు శుభ్రం చేయడానికి ఎన్నికకాలేదని ఘాటుగా సమాధానమిచ్చారు. 'మీ మురికివాడలను శుభ్రం చేయడానికి నేనేం పారిశుధ్య కార్మికురాలిని కాదు. డ్రైనేజీ, టాయిలెట్లను పరిశుభ్రం చేయడానికి కాదు నేను పార్లమెంట్‌కు ఎన్నికయింది. నేను స్థానిక ప్రజాప్రతినిధులను సమస్వయం చేసి పని చేయచేయిస్తాను' అంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేవలం స్థానిక ఎమ్మెల్యేలకు, మున్సిపల్‌ అధికారులకు, కార్మికులకు మాత్రమే ఆదేశాలు జారీ చేస్తాను. వారితో పని చేయించుకోవాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. ప్రగ్యా సమాధానంపై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories