సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులకు గుడిలో తీర్థం పోసి ప్రసాదం ఇస్తారు.
సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులకు గుడిలో తీర్థం పోసి ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదంలో కూడా ఎన్నో వెరైటీలు ఇందులో ఇందులో ముఖ్యంగా పులిహోర, లడ్డూ, చెక్కర పొంగలి, గుడాలు, అటుకులు ఇలా ఎన్నో రకాల ప్రసాదాలు ఇవ్వడం చూసాం కానీ ఓ గుడిలో మాత్రం ఏకంగా 5స్టార్ హోటల్లో పెట్టినట్టుగా చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని ప్రసాదంగా ఇస్తున్నారు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఎక్కడ ఇంత వించ ఆచారాన్ని పాటిస్తున్నారో తెలుసుకోవాలనుందా.
పూర్తివివరాల్లోకెళ్తే తమిళనాడులోని మధురైలోని మనియాండి స్వామి గుడిలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆలయంలో దాదాపుగా 84 సంవత్సరాల నుంచి పాటిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా రెండు రోజుల పాటు ఇలా చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని ప్రసాదాన్ని ఇవ్వడం ఆ గుడి ఆచారం అని చెబుతున్నారు. ప్రతి ఏటా జనవరి 24 నుంచి 26 వరకు ఆలయ వార్షికోత్సవాన్నినిర్వహిస్తారని, ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు బిర్యానిని ప్రసాదంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని వారు తెలిపారు.
ఇదే తరహాలో ఈ ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే 150 మేకలు, 300 కోళ్లతో బిర్యానిని తయారు చేసి ప్రసాదంగా ఇస్తున్నామని తెలిపారు. అంతే కాదు ఈ ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో భుజించే సౌకర్యం కల్పించడమే కాకుండా భక్తులు ఇంటికి పార్సల్ ని తీసుకెళ్లే అవకాశాన్ని కూడా ఆలయ కమిటీ కల్పిస్తుంది. ఇక వారు అందించే ఆ బిర్యాని ప్రసాదం కోసం భక్తులు కూడా పెద్ద ఎత్తునే ఆలయానికి విచ్చేస్తున్నారని చెపుతున్నారు. అంతే కాదు ఆలయానికి విరాళాలు సైతం అందిస్తున్నారని అంటున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire