Asha Devi: నా కూతురికి న్యాయం జరిగింది.. భావోద్వేగానికి గురైన నిర్భయ తల్లి

Asha Devi: నా కూతురికి న్యాయం జరిగింది.. భావోద్వేగానికి గురైన నిర్భయ తల్లి
x
Asha Devi
Highlights

ఇన్నాళ్లకు తన కుమార్తెకు న్యాయం జరిగింది ఆత్మకు శాంతి కలిగింది అన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. నిర్భయ దోషులను ఉరితీయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు....

ఇన్నాళ్లకు తన కుమార్తెకు న్యాయం జరిగింది ఆత్మకు శాంతి కలిగింది అన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. నిర్భయ దోషులను ఉరితీయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం జరగాలని న్యాయపోరాటం చేస్తానన్నారు. ఇప్పటికైనా చట్టంలోని లోపాలను సరిచేయాలన్నారు ఆశాదేవి. ఎట్టకేలకు తన కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు నిర్భయ తండ్రి భద్రినాథ్ సింగ్. ఇక నుంచి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. నిర్భయ కేసు తీర్పు మహిళల విజయమని తెలిపారు.

నిర్భయ దోషులను ఉరి తీయడంతో ఆమె సొంత ఊరిలో ఆనందోత్సాహం నెలకొంది. యూపీలోని బల్లియ గ్రామంలో స్థానికులు డోలు వాయిస్తూ, రంగులు చల్లుకుంటూ ఆనందంతో నృత్యం చేశారు. ఎట్టకేలకు నిర్భయకు న్యాయం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories