ఉరేస్తారని తెలిసినా నిర్భయ దోషికి వెటకారం పోలేదా?

ఉరేస్తారని తెలిసినా నిర్భయ దోషికి వెటకారం పోలేదా?
x
అక్షయ్ ఠాకూర్
Highlights

నిర్భయ హత్య కేసులో మరికొన్ని రోజుల్లో చావబోతున్నా నిందితుడు అక్షయ్ ఠాకూర్ కి వెటకారం పోలేదు, దారుణమైన నేరం చేసి ఉరికంబం ఎక్కుతున్నా, ఇంకా అంతే...

నిర్భయ హత్య కేసులో మరికొన్ని రోజుల్లో చావబోతున్నా నిందితుడు అక్షయ్ ఠాకూర్ కి వెటకారం పోలేదు, దారుణమైన నేరం చేసి ఉరికంబం ఎక్కుతున్నా, ఇంకా అంతే నిర్లక్ష్యధోరణి. నిర్భయ నిందితులకు ఇప్పటికే క్షమాభిక్ష ప్రసాదించరాదని నిర్ణయించగా ఇప్పుడు అక్షయ్ ఠాకూర్ రివ్యూ పిటిషన్ వేశాడు. ఢిల్లీలో గాలి కాలుష్యం, నీటికాలుష్యంతో తన ఆయుష్షు ఇప్పటికే తగ్గిపోయిందని, నిత్యం ఛస్తూ బతుకుతున్న తనకు ఇక ఉరి ఎందుకని రివ్యూ పిటిషన్ లో ప్రశ్నించాడు.

నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు. దీంతో నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. ఈ నెల 16న ఉదయం 5 గంటలకు తీహార్ జైలు అధికారులు ఉరి శిక్షను అమలు చేయనున్నారు. ప్రస్తుతం దోషులు తిహార్‌ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories