తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు
x
Highlights

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్ ఆర్సీ.....

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన ఎన్‌హెచ్ ఆర్సీ.. హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. ఎన్ కౌంటర్ పై పూర్తి వివరాలు తెలియజేయాలని కోరింది.

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు. అయితే, దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ పై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories