గ్రేట్ రెస్క్యూ..ఆ మత్స్యకారులు మృత్యుంజయులు

గ్రేట్ రెస్క్యూ..ఆ మత్స్యకారులు మృత్యుంజయులు
x
Highlights

పోలవరం కాపర్ డ్యామ్ దగ్గర చిక్కుకున్న మత్య్సకారులను నేవీ హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. విడతలవారీగా బాధితులను ఒడ్డుకు తరలించారు.

పోలవరం కాపర్ డ్యామ్ దగ్గర చిక్కుకున్న మత్య్సకారులను నేవీ హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. విడతలవారీగా బాధితులను ఒడ్డుకు తరలించారు. తూర్పు గోదావరి జిల్లాలో 30 మంది మత్య్సకారులు చేపల వేటకు వెళ్లారు. పోలవరం కాపర్ డ్యాం దగ్గర వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో వెనుదిరిగారు. వెనక్కి వచ్చే ప్రయత్నంలో పడవలోకి నీరు చేరడంతో కొందరు అక్కడే చిక్కుకున్నారు. ఎట్టకేలకు కాపర్ డ్యామ్ పైకి చేరుకున్నారు. ఈ విషయంపై కొందరు అధికారులకు సమాచారం అందించారు.

కాపర్ డ్యామ్ పై చిక్కుకున్న మత్య్సకారులను కాపాడేందుకు NDRF బృందం రంగంలోకి దిగింది. విశాఖ నుంచి నేవీ హెలికాప్టర్ ను రప్పించారు. పోలవరం కాపర్ డ్యామ్ పై చిక్కుకున్న మత్స్యకారులను హెలికాప్టర్ విడతలవారీగా ఒడ్డుకు చేర్చారు. దీంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories