ములాయం సింగ్‌కు అస్వస్థత.. మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిక..

ములాయం సింగ్‌కు అస్వస్థత.. మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిక..
x
Highlights

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (80) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. అతన్ని ఆదివారం లక్నో నగరంలోని...

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (80) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. అతన్ని ఆదివారం లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఉదరకోశ సమస్యతో బాధపడుతున్న ములాయంకు గత ఐదు రోజుల్లో రెండోసారి అస్వస్థతకు గురవడంతో అతన్ని రెండోసారి ఆసుపత్రికి తరలించారు.

గతకొద్ది రోజులుగా ఉదరకోశ సమస్యలతో బాధపడుతున్నారు ములాయం సింగ్. ఈ క్ర‌మంలోనే ఈ నెల 6న ఆయ‌న అనారోగ్యానికి గురికావ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించారు. అన్ని రకాల టెస్టులు చేసిన వైద్యులు చికిత్స చేశారు. అనంత‌రం శ‌నివారం రోజునే ఆయ‌న్ను ఆస్ప‌త్రి నుంచి డిశార్చ్ చేశారు. ఆదివారం సాయంత్రం తిరిగి అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories