సరదాగ సెల్ఫీ తీసుకోబోయిన తల్లీ‌కూతుళ్లు.. ఇంతలోనే..

సరదాగ సెల్ఫీ తీసుకోబోయిన తల్లీ‌కూతుళ్లు.. ఇంతలోనే..
x
Highlights

కల్వర్టు అంచున సెల్ఫీ తీసుకుంటున్న తల్లీ, కూతురు ప్రమాదావశాత్తు వరద కాలువలో పడి మరణించిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని మాండ్సార్‌ జిల్లాలో చోటు...

కల్వర్టు అంచున సెల్ఫీ తీసుకుంటున్న తల్లీ, కూతురు ప్రమాదావశాత్తు వరద కాలువలో పడి మరణించిన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని మాండ్సార్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..స్థానిక ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్‌డీ గుప్తా బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని వరద కాలువను చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అతడి భార్య బిందు గుప్తా(48), కూతురు అశ్రితి(21) కాలువ వద్ద సెల్ఫీ దిగబోయారు. కాలువలో వరద ఉద్ధృతి ఎక్కువ అవ్వడంతో వారు నిల్చున్న కల్వర్టు కూలింది. ఈ ప్రమాదంలో బిందు, అశ్రిత వరద నీటిలో కొట్టుకుపోయారు. చుట్టు పక్కల వారు, పోలీసులు రంగంలోకి దిగి వారిని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతదేహాలను వెలికితీసినట్లు జిల్లా ఎస్పీ హితేష చౌదరి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories