నోట్ల కట్టలు రోడ్డు మీద పారేశారు..

నోట్ల కట్టలు రోడ్డు మీద పారేశారు..
x
Highlights

కొత్త 500 రూపాయల నోట్ల కట్టలు.. రోడ్డుపై పారేశారు దుండగులు. చెన్నై దగరలోని కోట్టూరుపురంలో రోజువారీ తనిఖీలలో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీలు...

కొత్త 500 రూపాయల నోట్ల కట్టలు.. రోడ్డుపై పారేశారు దుండగులు. చెన్నై దగరలోని కోట్టూరుపురంలో రోజువారీ తనిఖీలలో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఈలోపు ఓ వాహనం అటువైపు వచ్చింది. దానిని సోదా కోసం పక్కకు తీయమని చెప్పారు. ఇంతలో ఆ వాహనం లో ఉన్న వారు దానిలోంచి నోట్ల కట్టలున్న సంచుల్ని రోడ్డుపై విసిరేసి పారిపోయారు. అనుకోకుండా జరిగిన సంఘటనతో అవాక్కయిన్ పోలీసులు ఆ సంచుల్ని విప్పి చూడగా నోట్ల కట్టలు కనిపించాయి. ఇవి మొత్తం 1.56 కోట్ల రూపాయల నగదుగా గుర్తించారు. వీటిలో ఎక్కువగా కొత్త 500 రూపాయల నోట్ల కట్టలే ఉన్నాయి.

ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబ్బు ఎవరిది, ఎందుకోసం తీసుకెళుతున్నారనే దానిపై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories