రిక్షావాలాని లక్షాధికారిని చేసిన వర్షం ...

రిక్షావాలాని లక్షాధికారిని చేసిన వర్షం ...
x
Highlights

అదృష్టం అనేది మనిషికి ఎప్పుడు ఎలాంటి రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు.. ఇలాంటి అదృష్టమే ఓ రిక్షావాలాకి చిక్కింది. ఇక వివరాల్లోకి వెళ్తే గౌర్ దాస్ అనే...

అదృష్టం అనేది మనిషికి ఎప్పుడు ఎలాంటి రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు.. ఇలాంటి అదృష్టమే ఓ రిక్షావాలాకి చిక్కింది. ఇక వివరాల్లోకి వెళ్తే గౌర్ దాస్ అనే వ్యక్తి నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ లో రిక్షా తొక్కుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఈ నేపధ్యంలో తన తోటి రిక్షావాలాలతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నాడు. ఈ తరుణంలో భారీ వర్షం రావడంతో చేసేది ఏమిలేకా విహారయాత్రను రద్దు చేసుకున్నాడు. రిక్షా యూనియన్ ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా మధ్యలో అతనికి ఓ లాటరి అమ్మే వ్యక్తి తగిలాడు..

లాటరీ కొనాలని ప్రాదేయపడ్డాడు. దీనితో 30 రూపాయలు పెట్టి లాటరీ కొన్నాడు. ఓ వారం క్రితం లాటరీ సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి.. అందులో గౌర్ దాస్ కొన్న లాటరీ నంబర్ కు రూ.50 లక్షల బహుమతి వచ్చింది. దీనితో ఆ రిక్షావాలా ఆనందంతో ఈ విషయాన్ని తన భార్యకు చెప్పి ఆ లాటరీ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేసాడు. ఒకవేళ వర్షం పడకుండా ఉంటే, గౌర్ దాస్ పిక్నిక్ కు వెళ్లేవాడు, అతనికి ఈ లాటరీ మిస్సయ్యేదే కదా .. మొత్తానికి అతనికి వర్షం అదృష్టం రూపంలో వచ్చిందన్న మాట..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories