Maharashtra: మహారాష్ట్రలో కరోనాతో ఒక్కరోజే 122 మంది మృతి

Maharashtra: మహారాష్ట్రలో కరోనాతో ఒక్కరోజే 122 మంది మృతి
x
Highlights

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో...

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో బుధవారం వైరస్‌ ధాటికి 122 మంది కన్నుమూశారు. ఒకే రోజు ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. మొత్తం 2,587 మంది కరోనాతో మృతి చెందినట్లు మహారాష్ట్ర వైద్య శాఖ తెలిపింది.

కొత్తగా 2560 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 74, 860 కేసులు నమోదయ్యాయి. బుధవారం కరోనా నుంచి 996 మంది కోలుకొని డిశ్చార్జ్ అవగా.. మొత్తం 32,329 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 39, 935 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories