ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ..గవర్నర్‌తో విడివిడిగా భేటీ కానున్న శివసేన, బీజేపీ

ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ..గవర్నర్‌తో విడివిడిగా భేటీ కానున్న శివసేన, బీజేపీ
x
Highlights

మహారాష్ట్ర రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ, శివసేన స్పష్టత ఇవ్వకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది....

మహారాష్ట్ర రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ, శివసేన స్పష్టత ఇవ్వకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీతో ఇరు పార్టీల నేతలు భేటా కానుండటం మరింత ఆసక్తి కలిగిస్తోంది. గవర్నర్‌తో శివసేన నేత దివాకర్‌ రౌత్‌, సీఎం ఫడ్నవీస్‌ భేటీకానున్నారు. వీరిద్దరి భేటీ వార్తలను రాజ్‌భవన్‌ వర్గాలు సైతం ధృవీకరించాయి. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కేవలం దీపావళి పండగ సందర్భంగ మాత్రమే కలుస్తున్నారని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories