అప్పుడు పారిపోయిన జంట ఇప్పుడు తిరిగొచ్చింది!

అప్పుడు పారిపోయిన జంట ఇప్పుడు తిరిగొచ్చింది!
x
Highlights

సరిగ్గా పెళ్లికి ముందు వధువు తల్లితో వరుడి తండ్రి పరారైన ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.. గుజరాత్ లో జరిగిన...

సరిగ్గా పెళ్లికి ముందు వధువు తల్లితో వరుడి తండ్రి పరారైన ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.. గుజరాత్ లో జరిగిన ఈ సంఘటన అందరిని ముక్కున వేలు వేసుకునేలా చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. ! పెళ్ళికి ముందు పరారైన ఈ జంట వ్యాలెంటైన్స్ డే‌కు ముందు తిరిగివచ్చింది.

దాదాపుగా మూడు వారాల పాటు ఎక్కడోకో వెళ్ళిన ఈ జంట సమాజంలో తమ గురించి అనేక రకాలుగా అనుకుంటున్నారని తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చారట!.. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏర్పడింది. పారిపోయిన వరుడు తండ్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్ళగా, వధువు తల్లికి మాత్రం చేధు అనుభవమే ఎదురైంది. ఇన్ని రోజులపాటు వేరే వ్యక్తితో గడిపి ఇప్పుడు తిరిగొచ్చిన ఆమెను నేను అంగీకరించనని ఆమె భర్త ముకుల్ తెలిపాడు.

గుజరాత్‌లోని కటార్ గ్రాంకి చెందిన వీరు ఇరుపొరుగు.. చాలా కాలంగా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇరుకుంటుంబాల మధ్య రాకపోకలు పెరిగాయి. వారి కుంటుంబాలకు చెందిన కొందరు పెద్దలు సదరు మహిళ కూతురిని, ఆ వ్యక్తి కొడుకుకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఫిబ్రవరిలో పెళ్లి ముహుర్తం పెట్టుకున్నారు. ఫిబ్రవరిలో ఘనంగా వివాహం చేయాలని నిర్ణయింయాచారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వరుడు తండ్రి, వదువు తల్లి జనవరి 10 నుంచి కలిపించకుండా పోయారు.

ఈ పెళ్లి జరిగితే వరుసకు వరుడి తండ్రి, వధువు తల్లి అన్నాచెల్లెళ్లు అవుతారు. దీంతో వారు కనిపించకుండా పోయారు. అయితే వారిద్దరి నడుమ గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉండడంతో పెళ్లి జరిగితే అన్నాచెలెళ్లు అవ్వాల్సి వస్తుందని దీంతో ఇద్దరు కలిసి చెప్పపెట్టకుండా పారిపోయారు. ‎ఇద్దరు కనిపించకుండాపోవడంతో ఇరుకుటుంబ సభ్యులు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories