ప్రధానితో సీఎంల సమావేశానికి కేరళ సీఎం పినరయ్ విజయన్ డుమ్మా

ప్రధానితో సీఎంల సమావేశానికి కేరళ సీఎం పినరయ్ విజయన్ డుమ్మా
x
Highlights

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్ర‌ధాని మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్నారు. కోవిడ్‌19 నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి సీఎంల‌ను అడిగి...

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్ర‌ధాని మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్నారు. కోవిడ్‌19 నేప‌థ్యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి సీఎంల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పట్టుపడుతున్నాయి. మే 3 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు.

ఇదిలా ఉండగా కేరళ సీఎం పినరయ్ విజయన్ మాత్రం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశంలో పాల్గొన్నారు. వైరస్ కట్టిడికి కేరళ రాష్ట్రం తరపున సలహాలను ఇప్పటికే రాతపూర్వకంగా కేంద్రానికి ఇచ్చినందున సీఎం సమావేశానికి హాజరు కావడం లేదని ప్రకటన చేసింది ఆ రాష్ట్రం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories