మోదీజీ అభివృద్ధికి ఆశిస్సులు ఇవ్వండి!

మోదీజీ అభివృద్ధికి ఆశిస్సులు ఇవ్వండి!
x
Highlights

ఢిల్లీని మరింత అభివృద్ధి పధంలో నడిపించేందుకు ప్రధాని మోడీ ఆశీస్సులు కావాలని అన్నారు అరవింద్ కేజ్రీవాల్‌.. ముడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన...

ఢిల్లీని మరింత అభివృద్ధి పధంలో నడిపించేందుకు ప్రధాని మోడీ ఆశీస్సులు కావాలని అన్నారు అరవింద్ కేజ్రీవాల్‌.. ముడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని కోరారు.. ప్రధాని మోదీని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాము కానీ అయన వేరే పనుల్లో ఉండి రాలేదని అన్నారు. రామ్‌లీలా మైదానంలో ప్రజల సమక్షంలో ఆయన చేత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇది తన విజయం కాదని ప్రజల విజయమని పేర్కొన్నారు. ఢిల్లీ వాసుల ఇచ్చిన విజయానికి పరమావధిగా ఐదేళ్ళు పనిచేస్తానని అన్నారు. కులమతాల ప్రసక్తి లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతికి పాటుపడతామని చెప్పారు. ఇక ఇదివరకు సుపరిపాలన అందించడం వలెనే మళ్ళీ అతిపెద్ద విజయం సాధించామని మంత్రులకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

కేజ్రీవాల్ తరువాత కొత్త మంత్రులు కూడా ప్రమాణం చేశారు... గత ప్రభుత్వంలోని మంత్రులైన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోట్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ పదవి ప్రమాణం చేశారు. ఈ ఢిల్లీ ఎన్నికలలో అమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ 08స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతా కూడా తెర్చుకోలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories