శైవ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం కేదరినాథ్. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు ఎంతో పుణ్యం కలుగుతుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఆ ప్రాంతానికి...
శైవ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం కేదరినాథ్. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు ఎంతో పుణ్యం కలుగుతుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఆ ప్రాంతానికి వెళ్లడం ఎంతో కష్టతమైనా కూడా అక్కడికి వెళతారు చాలా మంది భక్తులు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ వారి కష్టాన్ని కూడా వారు మరచిపోతారు.
కానీ ఈ ఆలయాన్ని 6 నెలలు మూసివేసి, మరో 6 నెలలు భక్తుల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. అయితే ప్రస్తుతం చలికాలం కావడంతో ప్రతిష్టాత్మకమైన ఈ శైవ క్షేత్రాన్ని మంచు దుప్పటి కప్పుకుంది. అంతే కాక గుడి పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి.
ఈ సమయంలో భక్తులు రాక పోకలకు అసౌకర్యం కలగుతుందనే ఉద్దేశంతోనే ఈ ఆలయాన్ని 6 నెలల కాలం పాటు మూసేస్తారని ఆలయకమిటీ తెలిపింది. దీంతో పాటుగానే కేదారినాథ్తో పాటు, అమర్నాథ్ సహా చార్ధామ్ ఆలయాలను శీతాకాల సమయంలో మూసేస్తారు. మళ్లీ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకున్న భక్తులు ఆరు నెలల కాలం పాటు ఆగాల్సిందే.
Uttarakhand: Kedarnath temple covered in a thick blanket of snow after heavy snowfall in the area. pic.twitter.com/pjcLUBaQO5
— ANI (@ANI) November 30, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire