కాసేపట్లో కర్నాటక స్పీకర్ మీడియా సమావేశం

కాసేపట్లో కర్నాటక స్పీకర్ మీడియా సమావేశం
x
Highlights

ఓ వైపు ఎమ్మెల్యేల రాజీనామాలు ... మరో వైపు సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో కర్నాటక స్పీకర్ రమేష్ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీం...

ఓ వైపు ఎమ్మెల్యేల రాజీనామాలు ... మరో వైపు సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో కర్నాటక స్పీకర్ రమేష్ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాజీనామా చేసిన 14 మంది ఎమ్మెల్యేలు ... ముంబై నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో బెంగళూరు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య విధాన సౌధ దగ్గరకు చేరుకున్న ఎమ్మెల్యేలు మరోసారి తమ పదవులకు రాజీనామాలు చేస్తూ లేఖలు అందజేశారు. తమపై ఎవరి లేదంటూ చెబుతూ ... తక్ష‌ణమే రాజీనామాలు ఆమోదించాలంటూ కోరారు.

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోవడంతో విధాన సౌధ దగ్గర .. కాంగ్రెస్‌, జేడీఎస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో .. సభకు తప్పకుండా హాజరుకావాలంటూ విప్‌ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన పక్షంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఓటు వేయాలంటూ కోరింది. అయితే విధాన సౌధ దగ్గరకు చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని మార్షల్ అడ్డుకుని బయటకు తరలించారు.

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోవడంతో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే కాసేపట్లో స్పీకర్ మీడియా సమావేశం నిర్వహిస్తారని ఆయన కార్యాలయం నుంచి సమాచారం అందింది. దీంతో స్పీకర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories