సుప్రీం కోర్టుకు చేరిన కర్ణాటక రాజకీయ సంక్షోభం

సుప్రీం కోర్టుకు చేరిన కర్ణాటక రాజకీయ సంక్షోభం
x
Highlights

కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఎటూ తేల్చకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది....

కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఎటూ తేల్చకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్‌ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజీనామాలను ఆమోదించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఇందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories