కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న సీఎం కుమారస్వామి

కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న సీఎం కుమారస్వామి
x
Highlights

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కాంగ్రెస్ మంత్రులు అందరూ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సీఎం కుమార స్వామి గవర్నర్ ను కలవనున్నారు....

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కాంగ్రెస్ మంత్రులు అందరూ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సీఎం కుమార స్వామి గవర్నర్ ను కలవనున్నారు. కర్ణాటక మంత్రి వర్గంలో ఉన్న మంత్రులందరూ రాజీనామాలు చేశారు. మంత్రులందరూ స్వతహాగా రాజీనామాలు చేశారని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. చట్టపరంగానే అన్ని పనులు జరుగుతున్నాయని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

కర్ణాటకలో నెలకొన్న సంక్షోభం రెండు రోజుల్లో సమసిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను చర్చలకు ఆహ్వానించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories