Coronavirus: బీజేపీ ఎంపీ కుమార్తెకు క‌రోనా పాజిటివ్

Coronavirus: బీజేపీ ఎంపీ కుమార్తెకు క‌రోనా పాజిటివ్
x
representative image
Highlights

కర్నాటక రాష్ట్రంలో బీజేపీ ఎంపీ కుమార్తెకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పేరు...

కర్నాటక రాష్ట్రంలో బీజేపీ ఎంపీ కుమార్తెకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పేరు అశ్విని. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ జీఎం సిద్ధేశ్వర కుమార్తె. అశ్విని ఈ నెల 20వ తేదీన గుయానా నుంచి న్యూయార్క్, ఢిల్లీ మీదుగా బెంగ‌ళూరుకు చేరుకుంది.

అయితే ఆమెకు క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యాధికారులు వెల్ల‌డించారు. అశ్విని ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఆమెతో పాటే బెంగ‌ళూరుకు వ‌చ్చారు. ఇద్ద‌రు పిల్ల‌ల వైద్య నివేదిక రావాల్సి ఉంది. ఎంపీ సిద్దేశ్వ‌ర‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కరోనా నెగిటివ్ వ‌చ్చింది. అశ్విని ఓ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories