జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం..ఆరుగురు మృతి..

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం..ఆరుగురు మృతి..
x
Highlights

జార్ఖండ్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. గర్హ్వా ప్రాంతంలో బస్సు లోయలో పడింది. రహదారిపై వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు పక్కనే లోయలో పడిపోయింది. ఈ ఘటనలో...

జార్ఖండ్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. గర్హ్వా ప్రాంతంలో బస్సు లోయలో పడింది. రహదారిపై వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు పక్కనే లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 39 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన స్థలం వద్ద సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ బస్సులో ఇంకా 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories