ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం...
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా వచ్చిందని అనుమానంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయం భవనం ఖాళీ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా వచ్చిందనే ముందు జాగ్రత్తతోనే మిగతా ఉద్యోగులను అలర్ట్ చేశామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్పాండే తెలిపారు.
కరోనా ఎఫెక్ట్ : ఇన్ఫోసిస్ భవనం ఖాళీఅయితే ఉద్యోగులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అన్ని విధాలుగా తాము సంసిద్ధంగా ఉన్నట్లు తమ ఉద్యోగులను అభ్యర్థించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని, వదంతులు నమ్మవద్దని తమ ఉద్యోగులకు సూచించింది. ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో తమ కంపెనీ గ్లోబల్ హెల్ప్ డెస్క్ను సంప్రదించి సమాచారం పొందవచ్చనని పేర్కొంది. కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండడానికి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోవ్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం అన్ని ఐటీ, బయోటెక్ కంపెనీలకు ఆదేశించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది.
Infosys: We have taken a decision to evacuate one of our satellite buildings in Bengaluru as a precautionary measure, as one of our employees had been in contact with an individual with suspected COVID-19. pic.twitter.com/6XX6woISQ1
— ANI (@ANI) March 14, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire