కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్

కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్
x
Highlights

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ రెడీ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. యడ్యూరప్ప బలపరీక్ష నెగ్గకుండా...

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ రెడీ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. యడ్యూరప్ప బలపరీక్ష నెగ్గకుండా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ముంబైలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలను బెంగళూరు రప్పించే ఆలోచన చేస్తోంది. స్పీకర్ 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేయనున్నారన్న సమాచారం వారికి అందించడం ద్వారా బెంగుళూరు తీసుకువచ్చే ప్లాన్స్ వేస్తోంది. తద్వారా బలపరీక్ష ఎదుర్కోనున్న యడ్యూరప్పకు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది.

మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అర్హత యడ్యూరప్పకు లేదన్నారు మాజీ సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక అసెంబ్లీని బీజేపీ రాజకీయ ప్రయోగశాలగా మార్చిందని ఆరోపించారు. స్పీకర్‌ ఇప్పటి వరకు కేవలం ముగ్గురు శాసన సభ్యులపై మాత్రమే అనర్హత వేటు వేశారని తెలిపారు. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు లేదా అనర్హత పిటిషన్లపై ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు సిద్ధరామయ్య.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories