ఆ హెలికాప్టర్ అందుకే కూలిపోయిందా?

ఆ హెలికాప్టర్ అందుకే కూలిపోయిందా?
x
Highlights

భారత్, పాకిస్థాన్ ల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉన్న సమయంలో మన దేశపు వాయుసేనకు చెడిన హెలికాప్టర్ ఒకటి జమ్మూ లోని బుద్గాం వద్ద కూలిపోయింది. అందులో ఉన్న...

భారత్, పాకిస్థాన్ ల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉన్న సమయంలో మన దేశపు వాయుసేనకు చెడిన హెలికాప్టర్ ఒకటి జమ్మూ లోని బుద్గాం వద్ద కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 27 న చోటుచేసుకుంది. అపుడు హెలికాప్టర్ సాంకేతిక లోపాలతో కూలిపోయిందని అనుకున్నారు. అయితే దీనిపై వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీని ప్రారంభించింది. ఆ ఎంక్వయిరీలో హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం మన రక్షణ వ్యవస్థలే అని తెలిసింది. ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రికలో తాజాగా ఓ కథనం వచ్చింది. ఘర్షణ పూరిత వాతావరణ పరిస్థితుల్లో గగనతలంలోకి ఎగిరిన ఈ హెలికాప్టర్ ను పొరపాటున మన రక్షణ వ్య్వస్తలే కూల్చేసినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.

అందుకే కూల్చేశారా?

ఎంఐ-17 హెలికాప్టర్‌ బుద్గాం వద్ద మారుమూల ప్రదేశంలో కుప్పకూలిన ప్రదేశం నుంచి అతి ముఖ్యమైన బ్లాక్‌ బాక్స్‌(ఫ్లైట్‌ డేటా రికార్డర్‌) అదృశ్యమైంది. అందువల్ల ఈ ప్రమాదంపై విచారణలో జాప్యం జరిగింది. దీంతో కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీలో అక్కడి పరిస్థితుల ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఇక్కడో ప్రమాదకర విషయం వెల్లడైంది. వాయుసేకు చెందిన హెలికాప్టర్‌ను వాయుసేనకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలైన పైథాన్‌ , డెర్బే, స్పైడర్‌లలో ఏదో ఒకటి పొరబాటున కూల్చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. విధుల్లో ఉన్న పలువురు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది చోటు చేసుకొందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కీలకమై హెలికాప్టర్‌లోని ఐఎఫ్‌ఎఫ్‌ వ్యవస్థను స్విచ్చాఫ్‌ చేసి ఉంచారు. ఒక పక్క సరిహద్దుల్లో వైమానిక ఘర్షణ జరుగుతుంటే ఈ వ్యవస్థను ఎందుకు స్విచ్చాఫ్‌ చేశారో తెలియటంలేదు. దీంతో గగనతల రక్షణ వ్యవస్థలు ఈ హెలికాప్టర్లను శత్రువర్గానికి చెందినదిగా భావించి పేల్చివేశాయి. హెలికాప్టర్‌ గాల్లోకి లేచిన తర్వాత వెంటనే దానిని వెనక్కి రమ్మని పిలిచారు. ఈ క్రమంలో గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలోకి వెళ్లకుండా సురక్షితంగా వచ్చే మార్గాన్ని మాత్రం సూచించలేదన్న విషయం కోర్ట్ ఆఫ్‌ ఎంక్వైరీలో తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories