మరోసారి వధువు తల్లితో వరుడి తండ్రి పరార్

మరోసారి వధువు తల్లితో వరుడి తండ్రి పరార్
x
మరోసారి వధువు తల్లితో వరుడి తండ్రి పరార్
Highlights

కొన్ని రోజుల క్రితం వధువు తల్లితో వరుడి తండ్రి పరార్ అయిన ఘటన గుర్తుంది కదా! సూరత్ లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. జనవరి 10 న...

కొన్ని రోజుల క్రితం వధువు తల్లితో వరుడి తండ్రి పరార్ అయిన ఘటన గుర్తుంది కదా! సూరత్ లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. జనవరి 10 న ఇంటినుంచి వెళ్ళిపోయిన ఈ జంట తమ గురించి సమాజం అనేక రకాలుగా మాట్లాడుకుంటుండటంతో ఆ మాటలను తట్టుకోలేక ప్రేమికుల దినోత్సవం రోజున తమతమ ఇంటికి తిరిగివచ్చారు. ఇందులో వరుడు తండ్రికి ఎలాంటి పరాభవం ఎదురు కాబోగా, వధువు తల్లికి మాత్రం చేధు అనుభవమే ఎదురైంది. ఆమెని తన భర్త నిరాకరించడంతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

అయితే ఇప్పుడు అంతా ఒకే అనుకున్న క్రమంలో ఈ జంట మరోసారి పరార్ అయ్యారు, సూరత్‌కు చెందిన హిమ్మత్ పడ్నవ్ (46), శోభనా రావల్ (43) శనివారం రోజు వీరిద్దరూ ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ సూరత్‌లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నట్టు సమాచారం. చివరిసారిగా వీరు ఇంటికి వదిలి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కాగా, ఈ సారి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడం గమనార్హం..

నిజానికి వీరిద్దరూ 27 ఏళ్ల క్రితం ప్రేమికులు .. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు కానీ అందుకు శోభనా తండ్రి ఒప్పుకోగా వేరువేరుగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్న ఈ జంట తరుచుగా ఫోన్ లో మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో తమ పిల్లలకి పెళ్లి చేయాలనీ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఫిబ్రవరిలో పెళ్లి ముహుర్తం పెట్టుకున్నారు. ఫిబ్రవరిలో ఘనంగా వివాహం చేయాలని నిర్ణయింయాచారు. కానీ శోభన భర్తకి ఈ విషయం తెలియడంతో ఇంటినుంచి తమ బిడ్డల పెళ్లికి రెండు వారాల ముందు పరార్ అయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories