అమిత్‌ షాతో ముగిసిన గవర్నర్ భేటీ

అమిత్‌ షాతో ముగిసిన గవర్నర్ భేటీ
x
Highlights

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నర్సింహన్ భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరు సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల తాజా...

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నర్సింహన్ భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరు సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్‌ షాకు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలన్ని త్వరలోనే పరిష్కారమవుతాయని గవర్నర్ వెల్లడించారు. భేటీ అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ హోంమంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, స్నేహపూర్వకంగా ఉంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన ఉపయోగంలో లేని భవనాలను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేశామన్నారు. ఏపీ భవన్‌ సహా విభజన సమస్యలను ఒక‍్కొక‍్కటిగా పరిష్కరిస్తామని గవర్నర్‌ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories