గుండెపోటుతో గోవా డీజీపీ మృతి

గోవా  డీజీపీ ప్రణబ్ నందా
x
గోవా డీజీపీ ప్రణబ్ నందా
Highlights

గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) ప్రణబ్ నందా ఢిల్లీలో శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్టు ఐజీ జస్పాల్ సింగ్ ప్రకటించారు. ఢిల్లీకి ...

గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) ప్రణబ్ నందా ఢిల్లీలో శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్టు ఐజీ జస్పాల్ సింగ్ ప్రకటించారు. ఢిల్లీకి అధికారికి పనిపైన వెళ్లిన ఆయనకి హఠాత్తుగా మరణించడం తీరని లోటని ఐజీ జస్పాల్ సింగ్ అన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివిన ఆయన సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1988లో ఐపీఎస్ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్‌లలో ఆయన బాధ్యతలను నిర్వర్తించారు.

2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీల సెక్యూరిటీ వ్యవహారాలను చూసుకున్నారు. కాబుల్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో భారతీయుల భద్రతాధికారిగా సేవలందించారు. 2019 ఫిబ్రవరి నెలలో గోవా డీజీపీగా బాధ్యతలు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీస్‌ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్‌ మెడల్, స్పెషల్ డ్యూటీ మెడల్ లభించాయి. ప్రణబ్ నందా భార్య సుందరి కూడా ఐపీఎస్ అధికారిగా తన భాధ్యతలను నిర్వర్తించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories