సిలిండర్ పేలి కూలిన భవనం..పది మంది మృతి

సిలిండర్ పేలి కూలిన భవనం..పది మంది మృతి
x
Highlights

ఉత్తరప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మావూ జిల్లా మొహ్మదాబాద్ పరిధిలోని వలీద్ పూర్ లో గ్యాస్ సిలిండర్ పేలటంతో రెండతస్తుల భవనం కూలిపోయింది. ఈ...

ఉత్తరప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మావూ జిల్లా మొహ్మదాబాద్ పరిధిలోని వలీద్ పూర్ లో గ్యాస్ సిలిండర్ పేలటంతో రెండతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడగా 10 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేలుడు తర్వాత భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గ్యాస్ సిలిండర్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. అధికారులు తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories