హాట్స్ ఆఫ్ : అత్త పాడె మోసిన కోడళ్ళు

హాట్స్ ఆఫ్ : అత్త పాడె మోసిన కోడళ్ళు
x
Highlights

ఇప్పటివరకు మనం అత్తలను చంపినా కోడళ్ళను చూసి ఉంటాం . అత్తన్ని నానా హింసలు పెట్టిన కోడళ్ళను కూడా చూసి ఉంటాం. కానీ ఓ నలుగురు కోడళ్ళు మాత్రం తమ అత్తను ఓ...

ఇప్పటివరకు మనం అత్తలను చంపినా కోడళ్ళను చూసి ఉంటాం . అత్తన్ని నానా హింసలు పెట్టిన కోడళ్ళను కూడా చూసి ఉంటాం. కానీ ఓ నలుగురు కోడళ్ళు మాత్రం తమ అత్తను ఓ అమ్మలా చూసుకున్నారు . ఆమె చనిపోయిందని తెలిసి విలవిలాడిపోయారు . ఆమె భౌతికకాయంపై పడిపోయి గుండెలవిసేలా రోదించారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు పక్కనబెట్టి మరి ఆమె పాడెను భుజాలపై మోశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది .

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సుందర్ బాయి దగ్డూ(83) ఇటీవల కన్నుమూసింది. బ్రతికున్నంత కాలం సుందర్ బాయి దగ్డూ తన నలుగురు కోడళ్ళను కన్న బిడ్డలు లాగా చూసుకుంది. అందుకు తగట్టుగానే ఆమెను కూడా అ నలుగురు కోడళ్ళు కూడా ఓ తల్లిలాగే చూసుకున్నారు . అయితే ఇటివల సుందర్ బాయి దగ్డూ అనారోగ్యంతో కన్నుమూసింది . ఆమె మరణం అ నలుగురు కోడళ్ళను కలిచివేసింది . ఆమె భౌతిక గాయాన్ని నలుగురు కోడళ్లు అయిన లతా, ఉషా, మనీషా, మీనా తమ భుజాలపై మోశారు. ఇక తమ అత్త చివరి కోరిక ప్రకారం అత్త సుందర్ బాయి కళ్లను దానం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories