మరోసారి రెచ్చిపోయిన సిద్ధరామయ్య..అనుచరుడి చెంప చెళ్లు మనిపించిన సిద్ధరామయ్య
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి రెచ్చిపోయారు. మైసూరు ఎయిర్ పోర్టు వద్ద మీడియా ముందే తన అనుచరుడు చెంప...
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి రెచ్చిపోయారు. మైసూరు ఎయిర్ పోర్టు వద్ద మీడియా ముందే తన అనుచరుడు చెంప ఛెళ్లుమనిపించారు. కర్ణాటక మాజీ మంత్రి డి.కె.శివకుమార్ అరెస్ట్ నేపథ్యంలో సిద్ధరామయ్య మైసూరు విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచరుడు ఒకరు సిద్ధరామయ్యకు ఫోన్ ఇవ్వబోయారు.
ఓ విషయంలో ప్రభుత్వాధికారులతో మాట్లాడి సిఫార్సు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సదరు అనుచరుడు మొబైల్ ఫోన్ ను సిద్ధరామయ్య చెవి వద్ద పెట్టబోయాడు. దీంతో సహనం కోల్పోయిన సిద్ధూ కోపంతో సదరు అనుచరుడి చెంప పగలగొట్టారు. అనంతరం చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
#WATCH: Congress leader and Karnataka's former Chief Minister Siddaramaiah slaps his aide outside Mysuru Airport. pic.twitter.com/hhC0t5vm8Q
— ANI (@ANI) September 4, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire