ముంబైలో ఘోర ప్రమాదం.. కూలిన 'కసబ్‌' బ్రిడ్జి

ముంబైలో ఘోర ప్రమాదం.. కూలిన కసబ్‌ బ్రిడ్జి
x
Highlights

ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌(సీఎస్‌టీ) నుంచి అంజుమన్‌ కాలేజీ, టైమ్స్‌ ఆప్‌ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో...

ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌(సీఎస్‌టీ) నుంచి అంజుమన్‌ కాలేజీ, టైమ్స్‌ ఆప్‌ ఇండియా భవనంవైపు వెళ్లే పాదచారుల వంతెనలో కొంతభాగం గురువారం రాత్రి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని సీఎస్‌టీ నుంచి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను 'కసబ్‌ బ్రిడ్జి'గా వ్యవహరిస్తారు.

2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్‌ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో ఆ పేరు స్థిరపడిపోయింది. మృతులను అపూర్వ ప్రభు(35), రంజనా తంబ్లే(40), భక్తి షిండే(40) జహీద్‌ షిరాద్‌ ఖాన్‌(32), టి.సింగ్‌(35)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సింది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories