రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులు..

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులు..
x
Highlights

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు రాష్ర్టపతి భవన్ లో విందుకు హాజరయ్యారు. ట్రంప్ దంపతులకు రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ దంపతులు సాధర స్వాగతం పలికారు....

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు రాష్ర్టపతి భవన్ లో విందుకు హాజరయ్యారు. ట్రంప్ దంపతులకు రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ దంపతులు సాధర స్వాగతం పలికారు. బుద్ధుడి విగ్రహం దగ్గర ట్రంప్, కోవింద్ దంపతులు ఫొటోలు దిగారు. ట్రంప్ భారత్ పర్యటన గౌరవార్దం రాష్ర్టపతి విందు ఏర్పాటు చేశారు. రాష్ర్టపతి విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఎనిమిది రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

విందుకు హాజరైన కేంద్ర మంత్రులు, రాష్ర్టాల సీఎంలను రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ ట్రంప్ దంపతులకు పరిచయం చేశారు. ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు కేంద్ర మంత్రులతో ట్రంప్ దంపతులు కరచాలనం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories